38.2 C
Hyderabad
April 29, 2024 13: 29 PM
Slider గుంటూరు

ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి పై ఐప్యాక్ మారీచుకుల  పైశాచిక దాడి

#balakotaiah

రాష్ట్రంలోని ప్రజా రాజధాని అమరావతితో పాటు పలు సమస్యలపై, ముఖ్యంగా మహిళ అత్యాచారాలపై, వైసీపీ పాలనా లోపాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందన్న  కారణంగా ఎన్నారై స్వాతి రెడ్డి పై వైసీపీ సోషల్ మీడియా మారీచుకులు పైశాచిక దాడికి పాల్పడుతున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. ఎన్ఆర్ఐ స్వాతి రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ పెట్టిన వీడియో చూసానని, ఆమె ఆరోపణలకు సమాధానం చెప్పలేక వైసీపీ సోషల్ మీడియా కు చెందిన సజ్జల  భార్గవరెడ్డి నేతృత్వంలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని అల్లరి పాలు చేసే విధంగా నీచమైన నిందలతో ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు.  రాజకీయాలతో సంబంధం లేని ఆమె కుటుంబాన్ని కూడా కించపరిచేలా దాడికి పాల్పడ్డట్టు చెప్పారు.  విదేశాల్లో ఉంటున్న ఒక మహిళపై ఇంత పైశాచికి దాడి జరుగుతున్నా, రాష్ట్రంలో వైకాపా మహిళా మంత్రులు, మహిళా కమిషన్ నోరు మెదపకపోవడం సిగ్గు చేటని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. ఇలాంటి దుర్మార్గ కార్యక్రమాలకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టాలని డిజిపిని కోరారు.

Related posts

విద్యుత్ అంతరాయంతో రైతుల అవస్థలు

Satyam NEWS

కరోనా వదిలేసి సొంత ప్రతిష్ట కోసం కేసీఆర్

Satyam NEWS

మోడల్ ఎమ్మెల్యే: జూబ్లీహిల్స్ లో నిరంతర అన్నవితరణం

Satyam NEWS

Leave a Comment