42.2 C
Hyderabad
April 26, 2024 17: 47 PM
Slider ప్రత్యేకం

విపరీత ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలే ఉన్మాదులు

#SudhakarReddy30

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలే నిజమైన ఉన్మాదులని ప్రముఖ సైకాలజిస్టు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్ఞర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు మతిస్థితిమితం లోపించిందంటున్న విజయసాయి, సజ్జల, దమ్మంటే జగన్ తో పాటు మానసిక పరీక్షలకు సిద్దం కావాలంటూ సవాల్ విసిరారు.

ఈ ముగ్గురిని మెడికల్‌ బోర్డుకు రెఫర్‌ చేసి, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. అసహజ ప్రవర్తన, విపరీత  ధోరణి, ఉద్వేగ లోపాలు, వ్యసనాలు ఉన్నవారిలో మానసిక సమస్యలు ఉంటాయన్నారు.

సాధారణంగా ఉన్మాదులు విచక్షణ కోల్పోయిన ప్రవర్తిస్తారని, ఇతరులకు హాని కలిగించడం, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, నేరాలకు పాల్పడటం చేస్తుంటారని ఆయన తెలిపారు. 

గత చరిత్ర, ప్రస్తుత తీరు చూస్తే వీరిలో సైకోసిస్ లేదా ఉన్మాద లక్షణాలు ఉన్నట్టు స్పష్ఞంగా తెలుస్తోందని చెప్నారు.

మానసికవైద్య కేంద్రాలలోని నిపుణుల ద్వారా పరీక్షలు చేయిస్తే అన్నీ బయట పడతాయని సుధాకర్ రెడ్ఢి చెప్పారు.

Related posts

మాజీ మంత్రి జూపల్లి కి కరోనా నెగెటివ్

Satyam NEWS

సరెండర్:ఎస్పీఎదుట లొంగిపోయిన మావోయిస్టు

Satyam NEWS

కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: సిఐటియు

Satyam NEWS

Leave a Comment