కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు లోని మేడా నిలయంలో వైయస్సార్సీపి పదోవ ఆవిర్భావ దినోత్సవం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సి. రామచంద్రయ్య వైసీపీ పార్టీ జెండా ఎగురవేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజంపేట నియోజకవర్గం లోని వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.