26.7 C
Hyderabad
April 27, 2024 08: 54 AM
Slider నల్గొండ

మరువ లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి: ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

#aderla

దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ,వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఇందిరా చౌక్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ముందుగా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సాయిబాబా థియేటర్ రోడ్ లో గల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలతో ఇందిరా చౌక్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ విగ్రహానికి కార్యకర్తలతో కలసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆదెర్ల మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అమలు చేశారని అన్నారు.తెలుగు ప్రజలు మరచిపోలేని మహానేతగా ఎదిగి ప్రతి తెలుగువాడి గుండెల్లో సుస్థిర స్థానం  సంపాదించుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.అంతటి మహోన్నత వ్యక్తి ఆశయ సాధనకోసం తెలంగాణ రాష్ట ప్రజలకు సంక్షేమం, సమానత్వం,స్వయం సమృద్ధిని సాధించి రాజన్న సంక్షేమ పాలన అందిచే లక్ష్యంతో వైఎస్ షర్మిల నాయకత్వంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడుగులు వేస్తుందని అన్నారు.మరపురాని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం నియోజక వర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ, వర్ధంతి సందర్భంగా గరిడేపల్లి మండలం పోనుగొడు గ్రామానికి చెందిన చాందా గోపిరెడ్డి తన అనుచరులతో కలసి ఆదెర్ల శ్రీనివాస  రెడ్డి సమక్షంలో  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్,నున్నా రామారావు,శాగం రెడ్డి కోటి రెడ్డి, బలుసుపాటిరవి,వెంకటేశ్వర్లు,అహ్మద్,హాన్, నరసింహారెడ్డి,జాల వినయ్,శివారెడ్డి, బాబు నాయక్,దోర్శల కృష్ణారెడ్డి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కో కన్వీనర్ గా మారెపల్లి నవీన్

Satyam NEWS

మంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు

Satyam NEWS

మూడో రోజు కొన‌సాగిన విజయనగరం పోలీసుల ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్

Satyam NEWS

Leave a Comment