కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్.అండ్.బి బంగళా వద్ద సి.ఏ.ఏ,యనార్సీ లకు వ్యతిరేకంగా ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 10వ రోజుకు చేరాయి. ఈ నిరాహార దీక్ష శిబిరం కు ముస్లిం మహిళలు ర్యాలీ గా చేరుకొని సంఘీభావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కేంద్రం ఈ చట్టాలను ఉపహసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రానికి సి.ఏ.ఏ,యనార్సీలకు వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటించిన ముస్లిం మైనారిటీలు, తమ శాంతియుత పోరాటంలో కులమతాలకు అతీతంగా అందరూ కల్సిరావాలని పిలుపు నిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలకు ముస్లిం మైనార్టీ నేత గుల్జార్ తదితరులు అధ్యక్షత వహించారు.