28.7 C
Hyderabad
April 26, 2024 08: 21 AM
Slider కడప

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మహిళల ప్రదర్శన

CAA protest

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్.అండ్.బి బంగళా వద్ద సి.ఏ.ఏ,యనార్సీ లకు వ్యతిరేకంగా ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 10వ రోజుకు చేరాయి. ఈ నిరాహార దీక్ష శిబిరం కు ముస్లిం మహిళలు ర్యాలీ గా చేరుకొని సంఘీభావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కేంద్రం ఈ చట్టాలను ఉపహసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రానికి సి.ఏ.ఏ,యనార్సీలకు వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటించిన ముస్లిం మైనారిటీలు, తమ శాంతియుత పోరాటంలో కులమతాలకు అతీతంగా అందరూ కల్సిరావాలని పిలుపు నిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలకు ముస్లిం మైనార్టీ నేత గుల్జార్ తదితరులు అధ్యక్షత వహించారు.

Related posts

మౌనిక దీక్షకు ములుగు జిల్లా సాధన సమితి సంఘీభావం

Satyam NEWS

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇక నుంచి ప్రత్యేక ఎకౌంట్లు?

Satyam NEWS

Leave a Comment