విశాఖ పట్నంలో పర్యటించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ని వైసిపి అడ్డుకున్నది. నిన్న రాత్రి పోలీసులు చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించగా నేడు వైసిపి కార్యకర్తలు భారీ ఎత్తున మోహరించి చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దాంతో టీడీపీ, వైఎస్సార్ పార్టీల మధ్య తోపులాట జరిగింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు వైసిపి కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు విసిరారు.
previous post