42.2 C
Hyderabad
April 26, 2024 15: 17 PM
Slider జాతీయం

ఢిల్లీ ఫైర్: ఇప్పటికి 35 మంది మృతి

delhi fire

ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటికి 35 మంది మరణించారు. రాణీ ఝాన్సీ రోడ్డులోని  అనాజ్‌మండిలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో మరో 56 మంది వరకూ గాయపడ్డారు.

ప్లాస్టిక్ తయారీ భవనంలో అకస్మాత్తుగా  మంటలు వ్యాపించడంతో ఈ దారుణం జరిగింది. విపరీతమైన పొగ, మంటలతో ఊపిరాడక 35మంది చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాదం జరిగిన భవనంలో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేస్తున్నారు.

దీంతో ప్లాస్టిక్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ ప్లాస్టిక్ కాలిన వాసనకే అనేకమంది ఊపిరాడక చనిపోయినట్లు సమాచారం. 30 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేస్తున్నాయి. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related posts

విద్యుత్ బిల్లు కట్టలేను.. ఆర్థిక సహాయం చేయండి సారు

Satyam NEWS

కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వలసల వెల్లువ

Satyam NEWS

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో బానిసత్వం చేయిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment