గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి శివారులో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ లో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కలకలం సృష్టించారు. మావోయిస్టులమని చెప్పి షాప్ లో విధులు నిర్వహిస్తున్న సూపర్ వైజర్, సేల్స్ మెన్ పై దాడి చేసి వారి వద్ద సుమారు 65 వేల రూపాయలు, కొన్ని మద్యం సీసాలు కూడా తీసుకొని వెళ్ళినట్లు సమాచారం. ఫిర్యాదు అందడంతో ఘటనా స్థలాన్ని డీఎస్పీ, విజయభాస్కరరెడ్డి, పిడుగురాళ్ల సీఐ సురేంద్ర బాబు పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
previous post