విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడనున్నారు. విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబల్ నాయకులు, కార్యకర్తలు నేడు సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తమతో 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటికి వస్తారని ఆయన తెలిపారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో అందరూ బయటికి వెళ్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీని ఖాళీ చేస్తామని హెచ్చరించారు.
previous post