అది జాతీయ రహదారి నెంబర్…5, కోల్ కత్తా నుంచీ చెన్నైకి వెళ్లే నేషనల్ హైవే.ఆ హైవేపై ప్రయాణం అంటేనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిందే. గతంలో అదే జాతీయ రహదారినై అప్పటి టీడీపీ ఎంపీ కింజరాపు ఎర్రంనాయుడు, ఆతర్వాత మరో టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ భాష లను మింగేసింది. తాజాగా అదే జాతీయ రహదారిని నలుగురు ఆర్మర్డ్ రిజర్వు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకుంది.
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలసమయంలో రంగోయి దగ్గర లారీ కి వెనకనుండి బోలేరావాహనంలోవస్తున్న ఏఆర్ కానిస్టేబుళ్ల వాహనం ఢీ కొట్టింది. దీంతోఅక్కడిక్కడే బోలేరే వాహనంలో ప్రయాణీస్తున్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు అక్కడిక్కడేదుర్మరణం చెందారు. ఆ నలుగురు పేర్లు… ఏఆర్ ఎస్ఐ కృష్ణుడు, . ఏఆర్ హెచ్సీ లు బాబూరావు, అంథోని ,ఏఆర్ కానిస్టేబుల్ జనార్ధన్ లుగా గుర్తుంచారు పోలీసులు. సమచారం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బోలేరా వాహనంలో ఇరుక్కుని దుర్మరణం పాలైన వారిని బయటకు తీసి పోస్టు మార్టంకు తరలించారు.కాగా… పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారి పై ఎస్కార్ట్ వెళ్తున్న ఏఆర్ సిబ్బంది లారీని వెనకనుంచీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు.