38.2 C
Hyderabad
April 29, 2024 11: 51 AM
Slider హైదరాబాద్

బోడుప్పల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

acb trap

బోడుప్పల్ కార్పోరేషన్  కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఎకౌంట్స్ సెక్షన్ లో తనిఖీలు చేయగా ఎకౌంటెంట్  రాజేందర్ రెడ్డి పట్టుపడ్డాడు. కాంట్రాక్టర్ వెంకటేష్ గౌడ్ నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎకౌంటెంట్ రాజేందర్ రెడ్డి ని అదుపులోకి తీసుకుని ఏసిబి అధికారులు విచారిస్తున్నారు. వెంకటేష్ గౌడ్ నుంచి 62 లక్షల కాంట్రాక్టు పనికి ఇప్పటి వరకు 27 లక్షల బిల్లులు చెల్లించగా అందులో 7 శాతం అనగా 1లక్ష 80 వేలు లంచంగా రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశాడు. 6 రోజుల క్రితం 1 లక్ష రూపాయలు వేరే కాంట్రాక్టరు రాజేందర్ రెడ్డి అసిస్టెంట్ అయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన అసిఫ్ కు ఇచ్చాడు. అలాగే మిగతా 80 వేలు కావాలి అంటూ మళ్ళీ కాంట్రాక్టర్ కు ఫోన్ చేయగా 19 వ తేదీన 20 వేలు ఇచ్చి మిగతా 50 వేలు ఈ రోజు అసిఫ్ కి ఇస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. 50 వేలు రికవరీ చేసామని, విచారణ చేసి రిమాండ్ కు తరలిస్తామని ఏసీబీ dsp అచ్చెశ్వర్ రావు అన్నారు.

Related posts

స‌చివాల‌య సిబ్బందిపై ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్  ఆగ్ర‌హం

Satyam NEWS

మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

లాక్ డౌన్ బాధితులకు సహాయం చేసిన పూర్వ విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment