తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 344వ రోజు బుధవారం నిర్వహించారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి, ముప్పేర సదాశివరావు, గుంటక సాంబిరెడ్డి, షేక్ సాబ్ జాన్, ముప్పేర మాణిక్యాలరావు, తదితరలు పాల్గొన్నారు.