ఈ సారి జాతరకు అటు ఆర్డీఓ ఇటు వీఎంసీ కమీషనరూ కొత్తే
ఉత్తరాంధ్ర కల్పవల్లి ,విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి జాతర సందర్భంగా జారీ చేయనున్న పాస్ ల పై కాస్త అస్పష్టత ఏర్పడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత విజయనగరం పైడితల్లి సిరిమాను ఉత్సవం అత్యంత పకడ్బందీగా ప్రణాళికా నిర్వహించేందుకు విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే జాతరలో నిర్వహించే ప్రతీ అంశంపై కమీషనర్ శ్రీరాములనాయుడు.. పలు మార్లు కార్పొరేషన్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు కూడా.
ఈ క్రమంలో జారీ చేసే పాస్ ల విషయం లో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని..డిప్యూటీ స్పీకర్ ముందే అదీ పోలీసు అధికారుల ముందే స్పష్టం చేసారు. జాతరతో పాటు ముందు గా విజయనగరం ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎంతమంది కి ఎన్ని విధాలుగా పాస్ లు ఇస్తారో డిప్యూటీ స్పీకర్ సమక్షంలో ఓ నిర్ణయానికి రావాలన్నారు.
తదనుగుణంగా ఆర్డీవో పాస్ లు జారీ చేస్తారన్నారు.ఈ క్రమంలో ఘటాల ఊరేగింపు పై కమీషనర్ ఓ స్పష్టమైన సలహా ఇవ్వడం అందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించడంతో అప్పటికి ఓ కొలిక్కి వచ్చింది. ఇక జర్నలిస్టుల పాస్ ల విషయం ప్రస్తావన రావడంతో డిప్యూటీ స్పీకర్ కల్పించుకుని… ఐ అండ్ పీఆర్ ఆధ్వర్యంలో వారికి పాస్ లు జారీ అవుతాయని స్పష్తం చేసారు.పైడితల్లి పండుగ కు…అటు ఆర్డీవో ఇటు మున్సిపల్ కమిషనర్ కొత్త కావడంతో విశేషం మరి పాస్ ల విషయంలో ఆర్డీఓ సూర్యకళ నిర్ణయం ఏ విధంగా ఉంంటోందనని చూడలంటోంది…సత్యం న్యూస్.నెట్