నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తంబళ్లపల్లె పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. తేదేపా నాయకులు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారని పోలీసులు మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రోజు పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జీ శంకర్ యాదవ్, కోఆర్డినేటర్ కే మల్లికార్జున్ నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా రామచంద్రారెడ్డి అధికార ప్రతినిధి మధ్య పట్ల సూర్య ప్రకాష్, ఇతర నాయకులతో కలిసి భారీ వాహనశ్రేణితో తంబాలపల్లి నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు. అంగళ్లలో వైకాపా కార్యకర్తలు తెదేపా నాయకులు వాహనశ్రేణి లోని వాహనాలను కర్రలతో రాడ్లతో రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో తెదేపా నాయకుడు రాటకొండ మధుబాబు తీవ్ర గాయాలై రక్తం కారింది. తంబాలపల్లి నియోజకవర్గం అంగళ్లులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా టీడీపీ నాయకులపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం దాడికి పాల్పడిన వారిని ఏ మాత్రం నిలువరించలేదని ఆరోపించారు. వైసీపీ అధికార పక్షం నేతలు కాబట్టే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన నేతలు ప్రకటించారు.