సిగ్గు లేని, దిక్కుమాలిన సీఎం జగన్ చేతిలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని…బీజేపీ రాష్ట్ర నేత విష్ణు కుమార్ రాజు ధ్వజమెత్తారు. సర్పంచ్ నిధులను జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని…డిమాండ్ చేస్తూ…దాదాపు మూడు గంటల పాటు విజయనగరం కలెక్టరేట్ సమీపంలో ధర్నా చేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని నేతృత్వంలో బీజేపీ నేతలు హరనాథ్, గద్దె బాబూరావు, తదితరులు హాజరు కాగా ముఖ్య అతిథిగా విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో 2,199 గ్రామ పంచాయతీల సొమ్ము ను జగన్ ప్రభుత్వం హరించిందని విమర్శించారు. గ్రామ సర్పంచ్ ల కు నిధులు ఇవ్వకుండా.. తదనుగుణంగా గ్రామ పరిపాలన వ్యవస్థ ను నిర్వీర్యం చేసే పనిలో పడినట్లు స్పష్టమవుతోందన్నారు.జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు… ముప్పావు వంతు డబ్బులు కేంద్రమే మంజూరు చేస్తోందని చెప్పారు. అయితే రాష్ట్రంలో జగన్ మాత్రం… అభివృద్ధి, సంక్షేమం అని చెబుతూ…దొంగ మాటలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ధర్నా అనంతరం.. కలెక్టరేట్ వద్ద కొంత సేపు నినాదాలు చేసి…డీఆర్ఓ గణపతి రావుకు వినతిపత్రం ఇచ్చారు.