ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న బీజేపీ మేనిఫెస్టో కాస్త గురువారంనాడు ఆ పార్టీ నేతలతో కలిసి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవిస్ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే హైదరాబాద్ ప్రజలందరికీ ఉచిత కరోనా టీకాను అందిస్తామని హామీనిచ్చింది. విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్, ఫ్రీ వైఫై సదుపాయం, మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం, పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలకు చెందిన విధంగా మేనిఫెస్టో రూపొందించ బడిందని పేర్కొన్నారు. ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, డీకే అరుణ బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో
పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
నివాస ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా మంచినీరు
ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించడం
గ్రేటర్లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆన్లైన్ క్లాస్లకు ఉచిత ట్యాబ్లు
ప్రయివేటు స్కూల్స్లో ఫీజుల నియంత్రణ
అందరికీ ఉచితంగా కరోనా టీకాలు
బస్తీల్లో వందశాతం ఆస్తి పన్ను మాఫీఎల్ఆర్ఎస్ రద్దు
ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు
మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం
సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత
మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ