32.7 C
Hyderabad
April 27, 2024 02: 02 AM
Slider నల్గొండ

డి.ఎస్.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

#dsrtrust

డి.ఎస్.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం ఎర్రగట్టు గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరాడు. అతనికి డాక్టర్ పరీక్షలు చేసి ఆపరేషన్ కి రక్తం తక్కువ ఉన్నదని చెప్పటంతో సంబంధిత కుటుంబీకులు పట్టణంలోని తిలక్ నగర్ నందలి డి.ఎస్.ఆర్.ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. బాబురావు తక్షణమే స్పందించి వేముల బాలరాజు ను వైద్యశాలకు పంపి ‘ఓ’ పాజిటివ్ రక్తందానం చేయించారు.

డి.ఎస్.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో వేముల బాలరాజు ఇప్పటికి 4వ,మారు రక్తందానం చేయటం జరిగిందని బాబురావు తెలిపారు. రక్తదాత బాలరాజు మాట్లాడుతూ డిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున రక్తదానం చేయటం తనకు చాలా సంతోషంగా ఉన్నదని,ఆపదలో ఉన్నవారికి ఏదో రకంగా ఆదుకోవాలని,మానవ సేవే మాధవ‌ సేవగా భావించాలని,రక్తదానం కూడా సేవలో ఒక భాగం అని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు రక్తదాత  బాలరాజు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

బాసరలో భక్తుల సందడి: వైభవంగా వసంత పంచమి వేడుకలు

Satyam NEWS

అపరంజి ట్రస్ట్ ద్వార అలుపేరగని సేవా కార్యక్రమాలు

Satyam NEWS

వృద్ధులంతా అవినీతిపరులైతే మరి ఈమె సంగతి ఏమిటో…..?

Satyam NEWS

Leave a Comment