రక్త దానం చేయడం కోసం ముందుకు వస్తున్న యువతీ యువకులకు డి ఎస్ ఆర్ ట్రస్ట్ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అంకిత భావంతో రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన శిరీష బాలింతరాలుకు రక్తం తక్కువ ఉందని మనోహర్ వైద్యశాలలో డాక్టర్ బాధితులకి చెప్పటంతో బాధితులు పట్టణంలోని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి ఫోన్ చేయటంతో తక్షణమే స్పందించి బ్లడ్ డోనర్ కోదాడ కు చెందిన ట్రస్ట్ సభ్యుడు బోయిళ్ల రాజు ని బ్లడ్ బ్యాంక్ పంపించి ‘బి’ పాజిటివ్ రక్తం ఇప్పించారు.డి ఎస్ ఆర్ ట్రస్ట్ తరఫున రక్తదానం చేసిన బోయిళ్ల రాజు కి ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్