బ్రెజిల్లో భయానక వాతావరణం నెలకొంది. అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ వరదల కారణంగా 18 మంది చనిపోయారు. సుమారు 300 మందికి వరకు గాయపడ్డారు. దాదాపు 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షాల కారణంగా ఇటాంబే నగరంలో ఓ ఆనకట్ట తెగిపోయింది. దీంతో వరదలు ముంచెత్తుతాయనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. రెండు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అక్కడి వాతావరణ శాఖ అధికారులు.