గుర్తు తెలియని దుండగులు గుంటూరు జిల్లా కాశిపాడులో ఒక కిరాణా వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. అడ్డువచ్చిన ఆయన భార్యను అతి కిరాతకంగా హింసించారు. ఈ దారుణ హత్య ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిల్లర కొట్టు వ్యాపారి పులిపాటి రాధాకృష్ణమూర్తి…భార్య వెంకట నరసమ్మ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసారు.
ఈ సంఘటనలో భర్త రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్ర గాయాలు కావడంతో మొదట అమరావతి నుండి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.