42.2 C
Hyderabad
April 26, 2024 18: 06 PM
Slider గుంటూరు

ఎట్రాషియస్: కిరాణా వ్యాపారి దారుణ హత్య

#Brutal Murder

గుర్తు తెలియని దుండగులు గుంటూరు జిల్లా కాశిపాడులో ఒక కిరాణా వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. అడ్డువచ్చిన ఆయన భార్యను అతి కిరాతకంగా హింసించారు. ఈ దారుణ హత్య ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. 

స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రామానికి చెందిన చిల్లర కొట్టు వ్యాపారి పులిపాటి రాధాకృష్ణమూర్తి…భార్య వెంకట నరసమ్మ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసారు.

ఈ సంఘటనలో భర్త రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్ర గాయాలు కావడంతో మొదట అమరావతి నుండి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

నిత్యావసరాలు అందించిన భగత్ సింగ్ సేవా సమితి

Satyam NEWS

బట్టల కొట్లుగా మారబోతున్న అన్న క్యాంటిన్లు

Satyam NEWS

Leave a Comment