విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ ,టీడీపీ వ్యవస్థాపుకులు ,ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు… విజయనగరం జిల్లా పార్టీ సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 20న స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విజయనగరం లో ఎనిమిది మంది మహానుభావులందరికి పార్టీ సీనియర్ నేత,
పోలీట్ బ్యూరో ,కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని పార్టీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, కంది మురళి నాయుడు, విజ్జపు ప్రసాద్ లు తెలియజేసారు. ఉదయం తొమ్మిది గంటలకు… నగరంలో ని కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, అలాగే జ్యోతిరావు పూలే, గాంధీ, ఘంటసాల,
అంబేద్కర్ విగ్రహాలకు పార్టీ సీనియర్ నేత అశోక్ తో పార్టీ ఇతర నేతలంతా నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 4 గంటలకు అశోక్ బంగ్లాలో… ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం…ఉత్సాహంగా.. ఉల్లాసంగా… జరుగుతుందని…ఈ కార్యక్రమానికి… పార్టీ అభిమానులు, నేతలు ప్రముఖులతో పార్టీ నగర ప్రజలు హాజరవ్వాలని నేతలు కోరారు.