ఈ నెల 25,26,27 తేదీల్లో చంద్రబాబు నాయుడు పల్నాడు పర్యటన
మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ జాతీయ అధ్య క్షుడు నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శనివారం నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని ఏర్పాట్ల పై చర్చించారు.
ఈ సంధర్బంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ….రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని,అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి పాలనతో విసిగిపోయారన్నారు.ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.25,26,27వ తేదీలో జరిగే చంద్రబాబు నాయుడు పర్యటన ద్వారా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతను,ఐక్యతను రుజువు చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు.నరసరావుపేట నియోజకవర్గంలో డా౹౹చదలవాడ అరవింద బాబు వైసీపీ అరాచక పాలన పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ప్రతి ఒక్కరు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటానికి సిద్ధపడాలన్నారు.
పల్నాడు రౌడీ రాజకీయాలకు,జగన్ రెడ్డి నియంత్రత పాలనకు వ్యతిరేకంగా అరవింద బాబు సాగిస్తున్న పోరాటం ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని ప్రశంసించారు.నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ…… జగన్మోహన్రెడ్డి అధిక ధరలు,విద్యుత్ ఛార్జీలు,కరెంట్ ఛార్జీలతో ప్రజల పైన మోయలేని భారం మోపారన్నారు.రాష్ట్రంలో పేదల వ్యతిరేక పాలన కొనసాగుతోందన్నారు.జగన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.
చంద్రబాబు పల్నాడు పర్యటనను నాయకులు,కార్యకర్తలు విజయంవంతం చేయాలని కోరారు.వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడికి కానుక ఇద్దామన్నారు.నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ…..మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అణిచివేతకు గురవుతున్నారన్నారు.చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు నరసరావుపేట నియోజకవర్గంలో పట్టణం,రెండు మండలాల పార్టీ అధ్యక్షులు,అనుబంధ సంఘాల నేతలు కృషి చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య,కడియాల రమేష్,కొట్ట కిరణ్,గొట్టిపాటి జనార్దన్ బాబు,మన్నన్ షరీఫ్,మద్దూరి వీర రెడ్డి,అత్తులూరి సుబ్బారావు,కడియాల తాండవ కృష్ణ,కాండ్రతి సాంబయ్య,చింతిరాల బాలు,చల్లా సుబ్బారావు, మానుకొండ జాహ్నవి,కనుమూరి లక్ష్మి, మల్లవరపు సింధు తదితరులు పాల్గొన్నారు.