బీఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈరోజు ములుగు నియోజకవర్గ లోని జడ్పీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు,బంగారు తెలంగాణ నిర్మాత, నాలుగున్నర కోట్ల ప్రజల జీవ నాడి, ప్రజా సంకల్ప నాయకులు తెలంగాణ ఉద్యమ రథ సారథి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, కార్యదీక్ష పరుడు, మేదోశక్తితో బంగారు తెలంగాణ బాటలు వేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్నారు. కాలేశ్వరం జలాలతో బీడు భూముల్లో సిరులు కురిపించిన
అపభగీరథుడు,సంక్షేమ పథకాల సృష్టికర్త,అలు పెరగని వీరుడు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య ములుగు జడ్పిటిసి సకినాల భవాని ములుగు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయరామ్ నాయక్ ములుగు టౌన్ అధ్యక్షుడు చెన్న విజయ్ ములుగు నియోజకవర్గ యువజన అధ్యక్షులు కోకిల
మహేష్ ముడిగే రాజ్ కుమార్ ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య జాటోత్ లాలు సానికొమ్ము రమేష్ రెడ్డి ములుగు మండల యువజన అధ్యక్షులు బైకానీ సాగర్ వేల్పూరి సత్యనారాయణ పిఎసిఎస్ చైర్మన్ చిక్కుల రాంబాబు ములుగు మండల
మైనారిటీ అధ్యక్షులు రాజా హుస్సేన్ మరియు అజార్ ములుగు మండల ఎస్టి విభాగం అధ్యక్షులు రాందాస్ నాయక్ సీనియర్ నాయకులు గరిగే రఘు చింతలపూడి నరేందర్ రెడ్డి మహమ్మద్ ఖాసిం అమర్ సింగ్ గజ్జి నగేష్ లింగమూర్తి శరత్ మరియు తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.