30.7 C
Hyderabad
April 29, 2024 06: 21 AM
Slider ముఖ్యంశాలు

4 కోట్ల 31 ల‌క్ష‌ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కు  పంపిణీ

#vidyadeevena

విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంఫిణీ…!

డా.బీ.ఆర్ అంబేద్క‌ర్ 131 జయంతి సంద‌ర్బఃంగా విజయనగరం ఆనంద గ‌జ‌ప‌తి ఆడిటోయిరంలో జ‌రిగిన స‌భ‌లో 4.31కోట్ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కును విద్యార్థుల‌కు,.6.51 కోట్లు విలువైన ఉన్న‌తి బ్యాంకు లింకేజీ చెక్కును మ‌హిళా సంఘాల స‌భ్యుల‌కు, డ‌ప్పు క‌ళాకారుల‌కు పింఛ‌న్ మంజూరు ప‌త్రాల‌ను రాష్ట్ర విద్యాశాఖ‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ చేతుల‌మీదుగా పంపిణీ చేశారు.

కార్య‌క్రమంలో మంత్రి,ఎమ్మెల్యే ,ఎంపీ,కలెక్ట‌ర్ లు మాట్లాడిన అనంత‌రం ద‌ళిత సంఘాల నాయ‌కులు గండ్రేటి స‌త్య‌నారాయ‌ణ‌, గంటాన అప్పారావు  అంబేద్క‌ర్ గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు. ఇక‌. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా వివిధ పాఠ‌శాల విద్యార్థుల‌కు నిర్వహించిన వ్యాస‌ర‌చ‌న‌, వ‌క్తృత్వం, క్విజ్‌, డ్రాయింగ్‌, పాట‌ల పోటీల విజేత‌ల‌కు  బ‌హుమ‌తులను ఈ సంద‌ర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స చేతులుమీదుగా  అంద‌జేశారు.

అలాగే అగ్నిమాప‌క వారోత్స‌వాల క‌ర‌ప‌త్రాన్ని విద్యాశాఖ‌ మంత్రి ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, మేయ‌ర్  విజ‌య‌లక్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి, డిసిఎంఎస్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ అవ‌నాపు భావ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, సోష‌ల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్ రాజ్‌కుమార్‌, వివిధ శాఖ‌ల అధికారులు, ద‌ళిత సంఘాల నాయ‌కులు, విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Related posts

కేంద్రం ఇచ్చిన నిధులను తామిచ్చినట్లు చెబుతున్న ధర్మాన

Satyam NEWS

రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

Satyam NEWS

ఇసుక తుఫాన్ లో జగన్ సర్కార్

Bhavani

Leave a Comment