క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరచిన పోలీస్ కానిస్టేబుల్ కుమార్తెను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి కె మనోహర్ అభినందించి ప్రోత్సహించారు. నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూం లో పోలీస్ కానిస్టేబుల్ గా దొడ్ల శ్యాంసుందర్ (1998 బ్యాచ్ PC నంబర్ 308 ) పని చేస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె దొడ్ల సాయి సంగీత హకిం పేట స్పోర్ట్స్ కాలేజ్ లో ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
దొడ్ల సాయి సంగీత అండర్ 18 రన్నింగ్ మీట్ లో మెడల్స్ సాధించింది.
1. నవంబర్ 11 నుండి 15 .2022 వరకు గౌహతి అస్సాం లో జరిగిన 37th జూనియర్ నేషనల్ మీట్ లో 100 మీటర్స్ లో సిల్వర్ మెడల్ వచ్చింది , అలాగే 200 మీటర్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.
2. సెప్టెంబర్ 11.2022 రోజున భూపాల్ మధ్యప్రదేశ్ లో జరిగిన యూత్ నేషనల్ మీట్ 200 మీటర్స్ లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది.
3. ఆగస్ట్ 23.2022 రోజున గుంటూరు లో జరిగిన సౌత్ నేషనల్ మీట్ 200 మీటర్స్ లో సిల్వర్ మెడల్ అలాగే 4*100 రిలే లో కాంశ్య పతకాన్ని సాధించడం జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కె మనోహర్, అదనపు CH రామేశ్వర్ దొడ్ల సాయి సంగీత సాధించిన మెడల్స్ గురించి తెలుసుకున్నారు. దాంతో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కి పిలిపించి సన్మానించారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో మెడల్స్ సాధించి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని, ఒలింపిక్ లో మెడల్స్ సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో RI నారాయణ రాజు, SI లు మాణిక్య నాయక్ , ప్రశాంత్ తో పాటు కంట్రోల్ రూం కి చెందిన స్టాప్ అందరు పాల్గొన్నారు.