అంతులేకుండా వస్తున్న కరోనా మృతదేహాలను ప్యాక్ చేసి బంధువులకు అప్పగించేందుకు బాడీ బ్యాగ్స్ కూడా దొరకని పరిస్థితి కృష్ణా జిల్లాలో నెలకొని ఉంది.
కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో బాడీ బ్యాగ్స్ కొరత భారీగా ఉంది.
కరోనా మృతదేహాలను భద్రపరచడానికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. కనీసం బ్యాగులు కూడా లేకపోవడంతో అలాగే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.
మార్చురీలలో మృతదేహాలు పేరుకు పోతున్నాయి.
అవసరాలకు తగ్గట్లుగా నిల్వలను ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
వెంటనే చర్యలు చేపట్టి అవసమైన ఏర్పాట్లు చేయాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.