కరోనా డెల్టా వేరియంట్ కొత్త మ్యూటెంట్ AY-4 ఇండోర్లో బయటపడింది. ఏడుగురు రోగుల నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్లో ఈ వేరియంట్ వెల్లడైంది. అయితే, ఈ వేరియంట్కు సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇండోర్లో, సెప్టెంబర్లో 7 మంది కరోనా బాధితులుగా గుర్తించారు. ఈ నమూనాలన్నీ సెప్టెంబర్ 21 న జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఢిల్లీ NCDC ల్యాబ్ నుండి జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ఇటీవల విడుదల చేశారు. అందులో ఈ ఏడుగురికి సోకిన కరోనా AY-4 రకానికి చెందినదిగా నిర్ధారించారు.
ఇప్పుడు ఇండోర్లో ఈ మ్యూటంట్ సోకిన రోగులు వెలుగులోకి వచ్చారు. అయితే, ఈ రోగులందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. వారికి, వారి నుండి ఎవరికీ ప్రమాదం లేదు. ప్రస్తుతం, AY-4 వేరియంట్ ప్రసార సామర్థ్యంపై ప్రపంచంలో పరిశోధన జరుగుతోంది.