35.2 C
Hyderabad
April 27, 2024 14: 23 PM
Slider చిత్తూరు

తిరుమల ఘాట్ రోడ్లపై కనువిందు చేస్తున్న జింకలు

tirumala ghat road

కరోనా ఎఫెక్ట్ తో తిరుమల ఘాట్ రోడ్లు మూతపడటం వన్య ప్రాణులకు పండుగ లా మారింది. గత నాలుగైదు రోజులుగా తిరుమల ఘాట్ రోడ్లలో జన సంచారం లేని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. దేవదేవుడి దర్శనాలు నిలిపివేయడంతో తిరుమలకు వచ్చే వారు లేకుండా పోయారు. తిరుమల నడక మార్గం మొత్తం జింకల పార్కు ఉంటుంది. ఆ పార్కు నుంచి అప్పుడప్పుడు కొన్ని జింకలు రోడ్లపైకి వచ్చేవి. అయితే ఇప్పుడు జింకలు పార్కులో కన్నా ఎక్కువగా రోడ్డు పైనే ఉంటున్నాయి.

యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈరోజు ఉదయం తిరుమల లోని మొదటి ఘాట్ రోడ్డులో కనిపించిన దృశ్యం ఇది. గత నాలుగు రోజుల నుంచి ఒక చిన్న శబ్దం, బస్సు, కార్లు, స్కూటర్ లాంటి వాహనాల సౌండ్ లేకపోయేసరికి సాధు జీవులు జింకలు రోడ్డు మీద ప్రశాంతంగా నీటి కోసం, ఆహారం కోసం వచ్చేస్తున్నాయి. వందేళ్ల తర్వాత అడవిలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్న రోజులు ఇవేమో అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తున్నది.

Related posts

కుతుబ్ మినార్ యాజమాన్య హక్కుల వ్యాజ్యం కొట్టివేత

Satyam NEWS

గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Satyam NEWS

విధ్వంసంతో ప్రభుత్వాన్ని లొంగదీయడం సాధ్యమా?

Satyam NEWS

Leave a Comment