ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి గెలుపుతో రాష్ట్రంలో పెను మార్పు మొదలు కావాలని పలువురు CPI,CPM వామపక్షాల నాయకులు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ వామపక్ష పార్టీల, ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాల, మద్దతుతో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ డోర్ టు డోర్,ప్రభుత్వ కార్యాలయాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలను పట్టించుకోని అధికార పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు . వామపక్షాల అభ్యర్థి జయసారధి రెడ్డికి అన్ని రంగాలలో అవగాహన ఉన్నందున ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి జయ సారధి రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.
కార్యక్రమంలో సిపిఐ,సిపిఎం నాయకులు పాలకూరి బాబు, యల్లావుల రాములు,గుండు వెంకటేశ్వర్లు,నాగారపు పాండు,శీతల రోషపతి,రేపాకుల మురళీ,యల్లావుల రమేష్,దేవరం మల్లేశ్వరి,జడ శ్రీనివాస్,ఇందిరాల వెంకటేశ్వర్లు,దుగ్గి బ్రహ్మం,జక్కుల రమేష్,వీరమల్లు,పాపయ్య ,పాశం వెంకటనారాయణ,జడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.