శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంగారుపేట రజకులకు చెందిన దోబీ ఘాట్ స్థలాన్ని కబ్జా చేశారు.
ఆ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి కబ్జా చేసి గుంతల మయం తీసి ఇసుక, మట్టిని తీసుకొని పోతున్నారని బంగారు పేట కు చెందిన రజకులు వెంకటగిరి డిప్యూటీ ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు.
వెంకటగిరి డిప్యూటీ ఎమ్మార్వో కి ఆయన కార్యాలయంలో శనివారం నాడు వారు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై తక్షణమే విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు.
వీఆర్వో, ఆర్.ఐ లను పంపించి తగు చర్యలు తీసుకుంటామని వెంకటగిరి డిప్యూటీ ఎమ్మార్వో రజకులకు హామీ ఇచ్చారు.
వెంకటగిరి సామాన్యుడు