సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి లో స్వయంవ్యక్త శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం మట్టపల్లి మహాక్షేత్రం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవములను దేవాలయ అర్చకులచే ఏకాంతంగా నిర్వహిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ -19 కేసులు పెరుగుచున్నదున తెలంగాణ పభుత్వం జి.ఓ నెం 1,6 ది.08.01.2022 & ది.09.01.2022 ప్రకారం నిబంధనలు అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవములకు భక్తులకు అనుమతి లేదు కనుక భక్తులు సహకరించగలరని దేవాలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు,విజయ్ కుమార్,ఆలయ కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్