సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కార్మికుల చిరకాల వాంఛ ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్) హాస్పటల్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం(జి.ఓ ఎంఎస్ నెంబర్. 26)ను విడుదల చేసిందని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలలో గెలిచిన అనంతరం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మంత్రులు కేటిఆర్,జగదీష్ రెడ్డి సహాయంతో నియోజకవర్గం లోని కార్మికుల సంక్షేమం కొరకు ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు అయినదని,బడుగు బలహీన వర్గాలు, కార్మికుల సంక్షేమం కొరకు పాటు పడే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అని తెలిపారు.నియోజకవర్గ కార్మికుల తరపున సిఎం కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్