28.7 C
Hyderabad
April 27, 2024 04: 47 AM
Slider నల్గొండ

పారిశుద్ధ్య కార్మికులకు MSF సన్మానం

#Nalgonda MRPS

ప్రజలు మొత్తం ఒక వైపు లాక్ డౌన్ పాటిస్తున్నా మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పరిసరాలను పరిశుభ్రం పరుస్తూ కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్నారని MSF జాతీయ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి మాదిగ కొనియాడారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం  ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్  ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సన్మానం సహకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులందరినీ శాలువాలతో సన్మానించారు. వారికి కోడిగుడ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గోపాల్ మాదిగ అధ్యక్షత వహించగా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, కమిషనర్, కౌన్సిలర్ సభ్యులు పాల్గొనగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ MEF రాష్ట్ర కన్వీనర్ మల్లె పాక వెంకన్న, సిపిఎం పార్టీ నాయకులు గిట్టా నాగేష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గాదె లింగ స్వామి ,గట్టు మల్లయ్య, నకిరెకంటి నాగరాజు, అంబాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెబల్ బెల్స్:ఎదురు తిరిగినా తమ వైపు తిప్పుకుంటారా

Satyam NEWS

జగన్ పార్టీ నుండి లీడర్లు పారిపోవడం షురూ!

Satyam NEWS

చట్టబద్ద హెచ్చరిక: పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరం

Satyam NEWS

Leave a Comment