మెడికల్ సీట్ల లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం పై కృషి చేసిన తల్లోజు ఆచారి కి బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఘనంగా సన్మానించారు.
ఆదివారం బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయనకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీలకు మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ఆ నిర్ణయం వెనకాల జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి కృషి అమోఘమని కొనియాడారు.
గత వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండి భారత ప్రధానమంత్రి, హోం శాఖమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సామాజిక న్యాయ శాఖ మంత్రులను. కలిసి ఒప్పించి దేశ వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు ఇప్పించడం నిజంగా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ముఖ్య సలహాదారు మొగిలి దుర్గాప్రసాద్ అధ్యక్షుడు మేకల రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు