32.7 C
Hyderabad
April 26, 2024 23: 36 PM
Slider మహబూబ్ నగర్

బిసిల రిజర్వేషన్ల కోసం కృషి చేసిన ఆచారికి ఘన సన్మానం

#talloju achari

మెడికల్ సీట్ల లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం పై కృషి చేసిన తల్లోజు ఆచారి కి బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ  ఘనంగా సన్మానించారు.

ఆదివారం బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయనకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీలకు మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ఆ నిర్ణయం వెనకాల జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి  కృషి అమోఘమని కొనియాడారు.

గత వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండి భారత ప్రధానమంత్రి, హోం శాఖమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సామాజిక న్యాయ శాఖ మంత్రులను. కలిసి  ఒప్పించి దేశ వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు ఇప్పించడం నిజంగా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సబ్ ప్లాన్  సాధన కమిటీ ముఖ్య సలహాదారు మొగిలి దుర్గాప్రసాద్ అధ్యక్షుడు మేకల రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు

Related posts

క్రిస్మస్ ను కరోనా నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలి

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు మద్యం పంచితే జైలుకే

Satyam NEWS

ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులపై సీరియస్ యాక్షన్

Satyam NEWS

Leave a Comment