28.7 C
Hyderabad
April 28, 2024 08: 10 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు

new ips

నేషనల్  పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 2018  బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఏపి క్యాడర్ కు కేటాయించిన వారిలో పి.జగదీష్ (కర్ణాటక), తుషార్ దుడి (రాజస్థాన్), కృష్ణకాంత్ పాటిల్ (తెలంగాణా), వి.ఎన్.మణికంఠ చందోలు (ఆంధ్రప్రదేశ్), కృష్ణకాంత్ (ఆంధ్రప్రదేశ్) లు ఉన్నారు. ఈ ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారులు  సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ ప్రత్యేక విభాగాలైన సీఐడీ,ఇంటిలిజెన్స్, ఎస్ఐబీ,అక్టోపస్, సెక్యూరిటీ వింగ్ , విజిలెన్స్, ఏసీబీ, గ్రేహౌండ్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిందిగా డీజీపీ  ట్రైనింగ్ ఐజీపీ సంజయ్ కు ఆదేశాలు జారీ చేశారు.

Related posts

పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు

Satyam NEWS

సంబురం

Satyam NEWS

గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం

Satyam NEWS

Leave a Comment