తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధి డాక్టర్ గోదా రమేష్ కుమార్ కు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని అయితే ఆ గుర్తు రద్దు అయిందని బిజెపి చేస్తున్న ప్రచారం అవాస్తవమని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
తమకు గాజు గ్లాసు గుర్తు రద్దు అయినట్లు బిజెపి ప్రచారం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. గాజు గ్లాసు గుర్తు రద్దు అయిందో లేదో అధికారికంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్న జర్నలిస్టు సాయి అసత్య ప్రచారాలను నిలిపివేయాలని ఆయన కోరారు.
బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని లేకుంటే చర్యలు తీసుకోవాలని ఈసీ ని కోరుతామని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో నవతరం పార్టీ ని ఎదుర్కొనడానికి బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారం ఆపాలని ఆయన కోరారు.