42.2 C
Hyderabad
April 26, 2024 15: 37 PM
Slider ప్రత్యేకం

గ్లాసు గుర్తు రద్దు కాలేదు: బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోంది

#NavataramParty

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధి డాక్టర్ గోదా రమేష్ కుమార్ కు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని అయితే ఆ గుర్తు రద్దు అయిందని బిజెపి చేస్తున్న ప్రచారం అవాస్తవమని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.

తమకు గాజు గ్లాసు గుర్తు రద్దు అయినట్లు బిజెపి ప్రచారం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. గాజు గ్లాసు గుర్తు రద్దు అయిందో లేదో అధికారికంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్న జర్నలిస్టు సాయి అసత్య ప్రచారాలను నిలిపివేయాలని ఆయన కోరారు.

బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని లేకుంటే చర్యలు తీసుకోవాలని ఈసీ ని కోరుతామని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో నవతరం పార్టీ ని  ఎదుర్కొనడానికి బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారం ఆపాలని ఆయన కోరారు.

Related posts

వరి పంట సాగు వద్దంటే రైతులు ఉరి వేసుకోవాలా?

Satyam NEWS

కర్నాటకలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు

Satyam NEWS

కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment