38.2 C
Hyderabad
April 29, 2024 20: 50 PM
Slider గుంటూరు

నారా లోకేష్ తో డీబీహెచ్ పీయస్ అధ్యక్షుడు భేటీ

#godarameshkumar

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ ఈరోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో భేటి అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీల అభివృద్దికై గత ప్రభుత్వాలలో కొనసాగిన పథకాలను వైసిపీ ప్రభుత్వం రద్దు చేసిందని రద్దు చేసిన పథకాలను ప్రభుత్వం తిరిగి కొనసాగించే విధంగా అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే విధంగా రాష్ట్రంలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్ సమావేశాలలో ఎంపీలు మాట్లాడేవిధంగా కృషిచేయాలని రమేష్ కుమార్ నారా లోకేష్ కు తెలిపారు.

అనంతరం ప్రస్తుత దళిత బహుజనుల సమస్యలపై రమేష్ కుమార్ చేపట్టిన ఉద్యమ విజయాలను నారా లోకేష్ అడిగి తెలుసుకుని  అభినందించారు. ఎస్సీల పథకాల రద్దుపై దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడితే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతామని అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు విదేశాలలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులను అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా వైద్య విద్యను చదివించామని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విదేశాలలో వైద్య అభ్యసిస్తున్న ఎస్సీలకు ఎటువంటి ఫీజులు చెల్లించక వారి భవిష్యత్ అంధకారంలో ఉందని తెలిపారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రీంలో ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదని నారా లోకేష్ తెలిపారు.

Related posts

402 గ్రామపంచాయతీలలో క్రీడా ప్రాంగణాలు

Murali Krishna

కుండపోత వర్షంతో తిరుమల కొండ ఘాట్ రోడ్డు మూసివేత

Satyam NEWS

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment