రాష్టం లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిన్నట్లు తొలుత ప్రచారం జరిగినా గతoలో బిజేపి ఎంపి బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్, హైదరాబాద్ లో ఈడీ, ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడి, ఐటి సోదాలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటి పై దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ , కరీంనగర్ లోని ఆయన ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. అలాగే గ్రనైట్ వ్యాపారి శ్రీధర్, గ్రానైట్ యజమాని అరవింద్ వ్యాసి ఇళ్ళు, కార్యాలయాలపై కూడా ఐటి అధికారులు దాడులు చేశారు. ఐతే ఈ దాడులలో ఐటి, ఈడీ అధికారులు సంయుక్తంగా పాల్గొనటం విశేషం. మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. దాదాపు 30 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోని సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐతో పాటు ఈడిలో గ్రానైట్ అక్రమాలపై కేసు వుంది.