జగన్ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కి.. తద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కానీ మోడీ ప్రభుత్వం… సంక్షేమ పధకాలలో ప్రజలను భాగస్వాములను చేసి..గడచిన ఎనిమిదేళ్ల నుంచీ సుపరిపాలన అందిస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు విజయనగరం ధర్మపురి లో జరిగిన ఓ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
జగన్…మందు పోసి…ఏడాది కి లక్షా 20వేలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. గడచిన ఈ ఎనిమిదేళ్ల లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కు ఇచ్చిన మాదిరిగా నే ఏపీకి నిధులు ఇచ్చిన… జగన్ అవి చెప్పక…తాను ఎన్నికల లో వాగ్దానం ఇచ్చిన విధంగా నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పధకాలు అందిస్తున్నానని చెప్పడం చూస్తుంటే చెట్టు పేరు చెప్పి కాయలు తెంపుకునే విధంగా ఉందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం గద్దె దిగిపోయే రోజు ఎంతో దూరంలో లేదని సోము వీర్రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురా లు రెడ్డి పావని..తదితరులు హాజరయ్యారు.