28.7 C
Hyderabad
April 27, 2024 03: 02 AM
Slider కడప

వాట్ ఈజ్ దిస్: రేషన్ కార్డుల తొలగింపుపై ధర్నా

janasena

అర్హులైన లబ్ధిదారులకు కూడా పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నేడు కడప జిల్లా నందలూరు బస్ స్టాండ్ కూడలి లో బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేదలకు అన్యాయం చేసే రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ధర్నాలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎమ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు, రాజంపేట బీజేపీ ఇంచార్జీ పోతుగుంట రమేష్ నాయుడు, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు మస్తానయ్య, జనసేన నాయకులు మలిశెట్టి వెంకట రమణ, ముకర్ధం చాంద్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, పింఛన్ లు తొలగించి వైసీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరచిరపోయిదని వారన్నారు.

రద్దుల ప్రభుత్వంగా మారి కక్ష తీర్చుకుంటోందని,  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగడాలను జనసేన, బీజేపీ అడ్డుకుంటుందని వక్తలు ధర్నా శిబిరంలో తెలిపారు. కాగా పింఛన్ రాని అర్హులైన వృద్ధులు  ఈ ధర్నాలో పాల్గొని ఆవేదన వ్యక్తంచేశారు.

Related posts

చంద్రబాబు కుటుంబాన్ని అవమానించడంతోనే వైసీపీ పతనం ప్రారంభం

Satyam NEWS

సినీ దర్శకుడు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

Satyam NEWS

వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment