తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్లో ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అదుపులోకి ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు.
బీఎస్-3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ఆర్టీఏ అధికారుల ఆరోపణ. నిన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు మాజీ మంత్రి అచ్చెంనాయుడిని అరెస్టు చేసి సంచలనం సృష్టించగా నేడు ప్రభాకర్ రెడ్డి ని ఆయన కుమారుడిని అరెస్టు చేశారు.