మాస్కులు లేకుండా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు వార్త తెలుగు జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో CI రాఘవ రావు,ఎస్ఐ వెంకట్ రెడ్డి సమక్షంలో మాస్కులు పంపిణీ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కరోనా రెండవ దశ ఉధృతిని అరికట్టాలనే సంకల్పంతో ప్రధాన రహదారిపై మాస్కులు లేకుండా ప్రయాణించే వారికి హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవ రావు,SI వెంకటరెడ్డి తమ సిబ్బందితో కలిసి వార్త దినపత్రిక ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాఘవ రావు మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా ఉధృతిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే బయటకు రావాలని అన్నారు.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కరోనా నియమ నిబంధనలు పాటించి ఆరోగ్య వంతులుగా ఉండాలి అన్నారు.