38.2 C
Hyderabad
April 29, 2024 13: 21 PM
Slider నల్గొండ

మద్దతు ధర కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

#INTUCHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ మండలం మర్రిగూడెం గ్రామంలో వరి పంటను ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్  నేడు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న ధాన్యాలు పండించాలని, మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కెసిఆర్  రైతులకు వాగ్ధానం చేశారని, కానీ నేడు సన్న ధాన్యాలకు గాని, మిగతా ధాన్యానికి మద్దతు ధర చెల్లించడం లేదని అన్నారు.

వెంటనే  రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ    కార్యక్రమంలో ఎస్ డి అజ్మతుల్లా, బెల్లంకొండ గురవయ్య, మేళ్లచెరువు ముక్కంటి, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవంబర్ నెలాఖరు లోగా పోడు భూముల సర్వే పూర్తి

Murali Krishna

ఉప్పల్ లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయం

Satyam NEWS

గురుకుల విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలి

Satyam NEWS

Leave a Comment