28.7 C
Hyderabad
April 27, 2024 06: 15 AM
Slider తెలంగాణ

షేక్ హ్యాండ్: కొమ్మిరెడ్డి రాములు ను కలిసి మధు యాష్కీ

kommireddy ramulu

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీతో తనకు ఉన్న విభేదాలు సమసిపోయినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొమ్మిరెడ్డి రామలు వెల్లడించారు. హైదరాబాద్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు, సంభాని చంద్రశేఖర్ ల సమక్షంలో మధు యాష్కీ, కొమ్మిరెడ్డి రాములు కలిసి మాట్లాడుకున్నారు. తనకు అసెంబ్లీ టిక్కెట్ రాకుండా మధుయాష్కీ అడ్డుకున్నారని కొమ్మిరెడ్డి రాములు గతంలో పలుమార్లు ఆరోపించారు. వి.హనుమంతరావు చొరవతో వారిద్దరు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకున్నారు.

తనకు టిక్కెట్ రాకుండా మధు యాష్కీ అడ్డుకున్నారనే ఆరోపణలపై వివరణ ఇచ్చారని, అది తనకు సంతృప్తి కలిగించిందని రాములు వెల్లడించారు. ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు హనుమంతరావుకు వారిద్దరూ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

అప్పులే అప్పులు : రివర్స్‌గేర్‌లో రాష్ట్రాభివృద్ధి

Satyam NEWS

ఆర్మీ చాపర్ కూలిన ఘటనలో కల్నల్ మృతి పట్ల నివాళులు

Satyam NEWS

మానసిక,శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా

Satyam NEWS

Leave a Comment