సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీతో తనకు ఉన్న విభేదాలు సమసిపోయినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొమ్మిరెడ్డి రామలు వెల్లడించారు. హైదరాబాద్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు, సంభాని చంద్రశేఖర్ ల సమక్షంలో మధు యాష్కీ, కొమ్మిరెడ్డి రాములు కలిసి మాట్లాడుకున్నారు. తనకు అసెంబ్లీ టిక్కెట్ రాకుండా మధుయాష్కీ అడ్డుకున్నారని కొమ్మిరెడ్డి రాములు గతంలో పలుమార్లు ఆరోపించారు. వి.హనుమంతరావు చొరవతో వారిద్దరు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకున్నారు.
తనకు టిక్కెట్ రాకుండా మధు యాష్కీ అడ్డుకున్నారనే ఆరోపణలపై వివరణ ఇచ్చారని, అది తనకు సంతృప్తి కలిగించిందని రాములు వెల్లడించారు. ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు హనుమంతరావుకు వారిద్దరూ ధన్యవాదాలు తెలిపారు.