టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నేడు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. తనపై నమ్మకంతో ములుగు జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని ఆయన చెప్పారు.
previous post