మావోయిస్టులకు పెద్ద కష్టం వచ్చింది.
సుమారు 100 మంది మావోయిస్టులు కరోనా తో పాటు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారని పోలీసుల సమాచారం.
ఛత్తీస్ ఘడ్ లోని దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలోని మావోయిస్టులు ఈ రుగ్మతలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత కూడా ఉన్నారు.
ఆమె పై 25 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
ఆమెతో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్ లు ఉన్నారని పోలీసులు తెలిపారు.
వీరంతా జనజీవన స్రవంతి లోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఎస్ పి అభిషేక్ పల్లవ్ తెలిపారు.