ప్రజాశక్తి దినపత్రిలో ఒంగోలు టౌన్ విలేకరిగా పని చేస్తున్న జీ రవికుమార్ కు కళ్ల ఆపరేషన్ కోసం కనిగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ రూ.20 వేలు ఆర్ధిక సాయం చేశారు.
రవికుమార్ కు రెండు కళ్లకూ చూపు తగ్గింది. రెటీనాకు చెన్నైలో చికిత్స చేయించుకుంటున్నాడు. ఈ పాటికే సంస్థ కొంత సాయం చేసింది.
తదుపరి వైద్యం కోసం అవసరాన్ని ఏపిడబ్ల్యూజేఎప్ జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి నాగేశ్వరరావు చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే ఆయన స్పందించి సాయం చేశారు. అడగ్గానే జర్నలిస్టుకు సాయం చేసిన ఏఎంసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కు ఏపిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వీ బ్రహ్మం ధన్యవాదాలు తెలిపారు.