42.2 C
Hyderabad
April 26, 2024 17: 03 PM
Slider నెల్లూరు

టీటీడీ చైర్మన్ గా మేకపాటి రాజమోహన్ రెడ్డికి అవకాశం?

#mekapati rajamohan reddy

తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న వై వి సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కాగానే మేకపాటి నియామకం జరగబోతున్నట్లు చెబుతున్నారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడు.

నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఎంపిగా గెలిచిన ఆయన గత ఎన్నికలలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరగానే తప్పుకుని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు.

ఈ కారణంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు సముచిత స్థానం కల్పించేందుకు నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు అవకాశం రావడంతో ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలిసింది.

వై వి సుబ్బారెడ్డికి మరో కీలక పదవి అప్పగించే అవకాశం ఉంది.

Related posts

మాల మహానాడు మానకొండూరు మండల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

కైండ్ గెశ్చర్: విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ వితరణ

Satyam NEWS

క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరచిన కానిస్టేబుల్ కుమార్తె

Satyam NEWS

Leave a Comment