వైస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.యస్. విజయమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆర్.కె.రోజా నేడు కలిశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలసిన మంత్రి రోజా మెకు కృతజ్ఞతలు తెలిపారు.
2011 వ సంవత్సరం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ పైన నిబద్ధతతో రోజా పడ్డ కష్టాన్ని విజయమ్మ అభినందించారు. పార్టీ పైన, నాయకుడి పైన రోజా ఎంతో నిబద్ధతతో కష్టపడి పని చేస్తుంది అని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక సందర్భంలో తనకు చెప్పిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు.
రోజా పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డికి, వై యస్ కుటుంబానికి వున్న అభిమానాన్ని కూడా విజయమ్మ వ్యక్తం చేశారు. రోజా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని విజయమ్మ ఆశీర్వదించారు.