అంగన్ వాడీల ద్వారా గర్భిణిలకు, చిన్నారులకు ఎలాంటి లోపం లేకుండా పౌష్టికాహారం అందివ్వాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేశించారు. నేడు ఆయన బరంపేట్ లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును ఆయన ఆరా తీశారు. హాజరు పట్టికలో సంతకాలు చేయకుండా సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి వచ్చిన వెంటనే సిబ్బంది హాజరుపట్టిలో సంతకం చేయాలని అలసత్వం వహిస్తే ఉపేకించేది లేదని స్పష్టం చేశారు. అంగన్ వాడీ టీచర్లతో పాటు ఇతర సిబ్బంది క్షేత్రస్థాయి పనితీరుపై ఆరా తీశారు. గర్భిణి స్త్రీలకు, పిల్లలకు చేరుతున్న సరుకులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. నరసరావుపేట పట్టణం, మండలం, రోంపిచర్ల మండలాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
previous post